కులకచర్ల : డాపూర్ మండల కేంద్రంలోని కిచ్చన్నపల్లిలో బాల్యవివాహాన్ని గ్రామ సర్పంచ్తో పాటు అధికారులు అడ్డుకున్నారు. మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య కుమార్తెను కిచ్చన్నపల్లి గ్రామానికి చెందిన రవికి ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయించారు. అమ్మాయి బండవెల్కిచర్ల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. విషయం తెలుసుకున్న 1098 సిబ్బంది, అధికారుల అమ్మాయి ఇంటికి వెళ్లి ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం చట్టరిత్యానేరమని రెండు సంవత్సరాల వరకు అమ్మాయికి వివాహం చేయరాదని వారిని హెచ్చరించారు.
అనంతరం ఇరు కుటుంబాల నుంచి రెండు సంవత్సరాల వరకు పెళ్లి చేయమని వాంగ్మూలం రాయించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్త రంగారెడ్డి, ఆర్ఐ లింగయ్య, అంగన్వాడీ టీచర్ కల్పన, బాలల పరిరక్షణ సమితి సభ్యుడు వెంకటేశ్, వార్డు సభ్యుడు అశోక్, చైల్డ్లైన్ మండల కో-ఆర్డినేటర్ రాంచంద్రయ్య పాల్గొన్నారు.