అబ్దుల్లాపూర్మెట్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడలోని భైరంఖాన్ చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్భగవత్ మంగళవారం పరిశీలించారు. ఏర్పాట్ల గురించి సీఐ స్వామి, సర్పంచ్ అంతటి యశోదఊషయ్యగౌడ్ను అడిగి తెలుసుకున్నారు. గణనాథులను నిమజ్జనం చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ చూడాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. మండలంలోని పరిసర గ్రామాలతో పాటు ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్ తదితర ప్రాంతాల నుంచి నిమజ్జనం కోసం ఈ చెరువులోకి విగ్రహాలు వస్తాయని తెలిపారు.
అదే విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఎసీపీ శ్రీనివాస్, అబ్దుల్లాపూర్మెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసం స్వామి, వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ మహేష్, ఇన్స్పెక్టర్లు జానకిరాంరెడ్డి, వీరభద్రం, కార్యదర్శి శ్రీనివాస్, బిల్కలెక్టర్లు ఉప్పు రాములు, పాల్ ఉన్నారు.