బోనాల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్
అమ్మవారికి ప్రత్యేక పూజలు
వికారాబాద్, జూలై 29 : వికారాబాద్ శివరాంనగర్ కాలనీ, ఆలంపల్లి, ఇంద్రానగర్ కాలనీల్లో గురువారం మహిళలు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య బోనాలతో ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. ఊరేగింపులో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్ గాయత్రి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్గుప్తా, గిరీశ్కొఠారీ, కిశోర్ పాల్గొన్నారు.
డప్పువాయిద్యాలు, పోతరాజుల ఆటపాటల మధ్య..
పూడూరు, జూలై 29 : అంగడి చిట్టంపల్లి, పూడూరు గ్రామాల్లో శుక్రవారం మహిళలు డప్పువాయిద్యాలు, పోతరాజుల ఆటపాటల మధ్య గౌడు కల్లు ఘటం, బోనాలతో దేవాలయానికి వెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.