అమ్డాపూర్లో అభివృద్ధి పరుగులు
గ్రామంలో పరిఢవిల్లుతున్న హరిత శోభ
రోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణంలా చెట్లు
మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు
రూ.60 లక్షలతో గ్రామాభివృద్ధి
మొయినాబాద్, జూలై 29: మండలంలోని అమ్డాపూర్లో అభివృద్ధి అద్దం పట్టినట్లుగా కనిపిస్తున్నది. పల్లె ప్రగతి పనులతో గ్రామం పచ్చదనం, పరిశుభ్రతలో దూసుకుపోతున్నది. పల్లె ప్రకృతి వనం గ్రామం రూపురేఖలు మార్చేసింది. వాకింగ్ ట్రాక్లు, పచ్చని చెట్ల గాలిని ఆస్వాదిస్తూ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటుచేశారు. గ్రామంలోని దారులు ఇరువైపులా మొక్కలతో హరిత శోభను సంతరించకున్నాయి. టీఆర్ఎస్ పాలనలో గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు మిషన్ భగీరథ ట్యాంక్లు నిర్మించి, ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారు.
అన్ని అభివృద్ధి పనులు పూర్తి
అమ్డాపూర్లో 550 కుటుంబాలు, 2,600 మంది జనాభా ఉంటారు. గ్రా మంలో పల్లె ప్రకతి వనం, మొక్కల పెం పకంపై సర్పంచ్ రవళి ప్రత్యేక దృష్టి పెట్టి పచ్చదనాన్ని పెంచి పోషిస్తున్నారు. గ తంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మా ణం పూర్తి చేశారు. ప్రస్తుతం మిగిలిపోయిన అంతర్గత మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. 100 శాతం ముగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. దీంతో గ్రామం పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నది. వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణం పూర్తయ్యాయి. వంద శాతం పన్ను వసూలుతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నది. రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం తదితర మౌలిక వసతుల కల్పన పూర్తవడంతో గ్రామస్తులు మురిసిపోతున్నారు
అడవిని తలపిస్తున్న ప్రకృతి వనం
పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన ప్రకృతి వనం అడవిని తలపిస్తున్నది. రకరకాల మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వాకింగ్ ట్రాక్లకు ఇరువైపులా పూల మొక్కలు నాటారు. దీంతో ప్రకృతి వనం అందాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ
గ్రామం పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి రోజు పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేయిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తాచెదారాన్ని పంచాయతీ ట్రాక్టర్తో సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రూ.6 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. రూ.3 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి నిలువ చేయడానికి కంపోస్టు షెడ్డు నిర్మించారు.
అనుబంధ రోడ్ల అభివృద్ధికి కృషి
గ్రామానికి ఉన్న అనుబంధ రోడ్ల అభివృద్ధికి కృషి చేశారు. అమ్డాపూర్ నుంచి సురంగల్కు ఉన్న అనుబంధ రోడ్డును రూ.5 లక్షలతో అభివృద్ధి చేశారు. దీంతో రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్డాపూర్ నుంచి శ్రీరాంనగర్కు వెళ్లే రోడ్డును దాతల సహాయంతో అభివృద్ధి చేశారు.
ప్రకృతి వనం గ్రామానికి మణిహారం
గ్రామ అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. ఇందులో భాగంగా వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మించాం. గ్రామంలో ఇంటింటికీ తిరిగి పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. గ్రామానికి ఉన్న అనుబంధ రోడ్లను అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లతో పాటు అంతర్గత మురుగు కాల్వలు నిర్మించాం. మొక్కల పెంపకంతో గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.