ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
యాచారం, జూలై29: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం యాచారం మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్ హాల్లో 593 నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. 73 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో 3,390 కార్డులు మంజూరయ్యాయన్నారు. యాచారంలో 630 మంది దరఖాస్తు చేసుకోగా 593 మందికి కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. కల్యాణ లక్ష్మి చెక్కులు సైతం జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు మంజూరవుతు
న్నాయన్నా రు. త్వరలో కొత్త గా ఆసరా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నా రు. విడో పింఛన్లపై రెవెన్యూ అధికారులు ఆగస్టులో నివేదిక త యారుచేసి అందించాలని సూచించారు. కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నా రు. సబ్సిడీ కింద గొర్రెల పంపిణీ, చేపపిల్లల పెంపకానికి చేయూత ఇస్తున్నదన్నారు. ఎస్సీల అభ్యున్నతికి ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి, మల్కీజ్గూడలో రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, తహసీల్దార్ నాగయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు ఉదయశ్రీ, శ్రీనివాస్రెడ్డి, సంతోష, హబీబ్, నర్సిరెడ్డి, కృష్ణ, శ్రీధర్రెడ్డి, అరుణమ్మ, సబిత, విజయలక్ష్మి, జగదీశ్, సరిత, ఎంపీటీసీలు శారద, శివలీల, జ్యోతి, లక్ష్మమ్మ, బాబు, లక్ష్మీపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాషా, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, రమేశ్, ఖాజా, శ్రీనివాస్, లోహిత్రెడ్డి పాల్గొన్నారు.