చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్, జూలై28: పేదల కడుపు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్తో కలిసి 796 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కుటుంబంలో ఎంతమంది ఉన్నా 23 కిలోల బియ్యం కంటే ఎక్కువగా ఇచ్చేవారు కాదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యక్తికి 6 కిలో బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేసి పేదల కడుపు నింపతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవరావు, తహసీల్దార్ అనిత, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం.మంజుల, సర్పంచ్లు జనార్దన్రెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్, ఎంపీటీసీ అర్జున్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, ఎంఏ రావూఫ్, రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.