కొండాపూర్, జూలై 9 : నియోజకవర్గంలోని సమస్యల శాశ్వత పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్ కాలనీల్లో చేపట్టిన పనులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డి, అధికారులు, స్థానికులతో కలిసి శు క్ర వారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని సమస్యల శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. కాలనీలు, బస్తీలలోని సమస్యలను వెంటనే కార్పొటర్ల దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, సీజనల్ వ్యాధుల నిర్మూలన పరిశుభ్రతతోనే సాధ్యమన్నారు. ఇండ్లతో పాటు చుట్టూ పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, అధికారులు డీఈ గోవర్ధన్, ఏఎంహెచ్ఓ చంద్రశేఖర్, నాయకులు దామోదర్రెడ్డి, రాజేందర్, ప్రసాద్, ఖదీర్, యాసిన్, కృష్ణ కుమారి, సైదేశ్వర్, కృష్ణ, వెంకటేశ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
మియాపూర్, జూలై9, పట్టణప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. హైదర్నగర్డివిజన్ రాంనరేశ్నగర్లో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నేశ్రీనివాసరావు, ఆయా విభాగాల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ కాలనీ, బస్తీలలో పర్యటించి గుంతలరోడ్లు, మురుగునీరు, వరదనీటి కాల్వల శుభ్రం, దోమలనివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కాలనీవాసులు, అధికారులతో కలిసి మొ క్కలు నాటారు. హరిత తెలంగాణలో భాగంగా మొ క్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, ఏఎంహెచ్ఓ చంద్రశేఖర్రెడ్డి, యస్ఆర్పీ సత్యనారాయణ, నాయకులు దామోదర్రెడ్డి, పోతుల రాజేందర్, కోనేరుప్రసాద్, సైదేశ్వర్, కృష్ణ, వెంకటేశ్యాదవ్, అష్రాఫ్, ఖదీర్, యాసిన్, కృష్ణ కుమారి, విమల, లత, స్వప్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.
హఫీజ్పేట్, జూలై 9, కాలనీ, బస్తీల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్గౌడ్ సూచించారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాశ్నగర్, జనప్రియనగర్పేజ్-1 అపార్టుమెంట్స్లో ఆయా విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పూజితగౌడ్ మాట్లాడుతూ బస్తీలలో సమస్యలు గుర్తించడమేగాకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూనే పచ్చదనం పెంపొందించే చర్యలు చేపడుతున్నామన్నారు. మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, డీఈ సురేశ్, ట్రాన్స్కో ఏఈ ఖాద్రి, నాయకులు యాదగిరిగౌడ్, వెంకటేశ్గౌడ్, నరేందర్గౌడ్, రామకృష్ణాగౌడ్, ప్రకాశ్నగర్, జనప్రియఫేజ్1 అధ్యక్షుడు ప్రవీణ్గౌడ్, వెంకట్రెడ్డి, శాంతయ్య, శ్రీనివాస్, చలపతి, మీనాక్షి, గిరిజ, రమ్య, సూర్యమని, పద్మ పాల్గొన్నారు.