జోగులాంబ గద్వాల : హరిత హారంతో గ్రామాలు పచ్చని చెట్లతో కళకళలాడాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (ఫేజ్-2)లో భాగంగా ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి దాసర్పల్లి అడవిరావుల్ చెరువు గ్రామం వరకు మొక్కలు నాటే కార్యక్రమంలో చైర్ పర్సన్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవిరావుల గ్రామంలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలో మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ రాజారెడ్డి, ధరూర్ మండల వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ