న్యూఢిల్లీ: బెంగాల్లోని నారద స్కామ్లో పలువురు మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ కేసులో సీబీఐ నలుగురు టీఎంసీ నేతల్ని కూడా అరెస్టు చేసింది. అయితే ఆ కేసులో సీఎం మమతా బెనర్జీ, మంత్రి మాలోక్ ఘటక్ వేసిన అప్పిల్ సుప్రీం కోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ అనిరుధ్ బోస్ తెలిపారు. ఆ ధర్మాసనంలో జస్టిస్ హేమంత్ గుప్తా ఉన్నారు. ఇక ఈ కేసు ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ ముందకు వెళ్తుందని గుప్తా తెలిపారు. నారద స్కామ్ కేసులో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. టీఎంసీ ఎమ్మెల్యేల అరెస్టు తర్వాత జరగాల్సిన పనులను స్థానిక ప్రభుత్వం అడ్డుకున్నట్లు సీబీఐ ఆరోపించింది.