న్యూఢిల్లీ : పౌరుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994 సవరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం, 1995 నిబంధనలకు అనుగుణంగా టెలివిజన్ చానెల్స్ ప్రసారం చేసిన విషయాలకు సంబంధించిన పౌరుల మనోవేదనలను, సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక చట్టపరమైన యంత్రాంగం.
ప్రస్తుతం నిబంధనల ప్రకారం కార్యక్రమాలు, ప్రకటనల కోడ్ల ఉల్లంఘనకు సంబంధించి వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ద్వారా సంస్థాగత విధానం ఉన్నది. అలాగే వివిధ ఛానళ్ల యాజమాన్యాలు.. ఫిర్యాదుల పరిష్కారానికి సొంతంగా అంతర్గత స్వీయ నియంత్రణ విధానాలను కూడా అభివృద్ధి చేసుకున్నాయి. అయినప్పటికీ, ఫిర్యాదుల పరిష్కార ఫ్రేమ్వర్క్ను మరింత బలోపేతం చేయడానికి చట్టబద్ధమైన యంత్రాంగాన్ని తేవాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అనుమతి పొందిన 900 కి పైగా టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) బుధవారం టీవీ ఛానల్ సెలెక్టర్ వెబ్సైట్ను ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్ లేకపోవడం వల్ల మొబైల్ యాప్ను ఉపయోగించలేని వినియోగదారుల కోసం ఈ వెబ్సైట్ను తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ల కోసం టీవీ ఛానల్ సెలెక్టర్ యాప్ను గత ఏడాది జూన్ 25 న లాంచ్ చేశారు.
ఐదు రోజులుగా టెలిస్కోప్ నుంచి నాసాకు అందని సిగ్నల్స్.. ఎందుకంటే..?
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ గురూ..!
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
కరోనా పుట్టినిల్లు.. వుహాన్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
చరిత్రలో ఈరోజు.. ముంతాజ్ జ్ఞప్తిగా తాజ్మహల్ నిర్మాణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..