నిజామాబాద్ రూరల్/ మోపాల్(ఖలీల్వాడి). జూన్ 16 : ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికసహాయం అందిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో 99 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్లతో కలిసి ఆయన పంపిణీ చేశారు. మోపాల్ మండలంలోని రైతు వేదిక భవన్లో 91 మంది లబ్ధిదారులకు చెక్కులను పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనూష, జడ్పీటీ సీ సుమలత, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, తహసీల్దార్ ప్రశాంత్కుమార్, ఎంపీడీవో మల్లేశ్, కార్పొరేటర్లు యమున, శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక, గిర్ధావర్ భూపతిప్రభు, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్, టీఆర్ఎస్ నాయకులు మ ధుకర్రావు, ప్రేమ్దాస్నాయక్, గంగారెడ్డి, అనిల్, అంకల గంగాధర్, రాంగోపాల్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మోపాల్ కార్యక్రమంలో ఎంపీపీ లతకన్నేరామ్, వైస్ ఎంపీపీ అనితాప్రతాప్, జడ్పీటీసీ కమలానరేశ్, మండ ల అధ్యక్షుడు ముత్యంరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సిద్దార్ధ, సాయరెడ్డి, భరత్, మోహన్ పాల్గొన్నారు.
సమాఖ్య భవనం ప్రారంభం
డ్వాక్రా మహిళలందరూ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టిని సారించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. పాంగ్రా గ్రామంలో రూ.32 లక్షలతో నిర్మించిన మండల మహిళా సమాఖ్య భవనాన్ని ఎంపీపీ బానోత్ అనూష, జడ్పీటీసీ బొల్లెంక సుమలత, కార్పొరేటర్ ప్రమోద్కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గం గారెడ్డి, ఐకేపీ ఏపీడీ మధుసూదన్లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశ్, డీపీఎంంలు మా రుతి, సంధ్యారాణి, సాయిలు, రాజయ్య, ఏపీఎంలు మ హేశ్ కుమార్, మోహన్, రవీందర్రెడ్డి, ఏపీవో పద్మ, ఎం ఎస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్యదర్శి రేణుక, కోశాధికారి లలిత, టీఆర్ఎస్ నాయకులు మాధవనగర్ విండో చై ర్మన్ నాగేశ్వర్రావు, బోర్గాం(పి) విండో చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, సీసీ లు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్ అన్నారు. కోటగిరి మండలంలోని హం గర్గా, కోటగిరి, హంగర్గా ఫారంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.సర్పంచులు పత్తి లక్ష్మణ్, ఎజాజ్ఖాన్, హంగర్గా ఉప సర్పంచ్ సుభాష్, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్దూ, వైస్ చైర్మన్ గజేందర్ ఉన్నారు.