పాట్నా: రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను ఎందుకు తొలగించారు అన్నది చిరాగ్ను పాశ్వాన్ను అడగాలని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పగ్గాలు చేపట్టిన చిరాగ్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మీడియాతో అన్నారు. చిరాగ్కు ఆ అధికారం లేకపోయినా ఆయన అలా చేశారని విమర్శించారు. తన పర్యవేక్షణలోనే బీహార్ ఎన్నికల్లో పోటీ చేశామని, 6 మంది ఎంపీలు గెలిచారని చెప్పారు. ఎన్నికల కమిషన్ నివేదిక ప్రకారం తమకు అత్యధిక శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. తాము ఎన్డీఏతో పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నామని, అయితే చిరాగ్ దీనికి అంగీకరించలేదన్నారు. ఎల్జేపీ పతనానికి ఇదే కారణమని పశుపతి కుమార్ పరాస్ ఆరోపించారు.
మరోవైపు చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్ కలిసి వస్తారని, ఇద్దరూ ఒక పార్టీలోనే ఉంటారని ఎల్జేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సూరజ్భన్ సింగ్ అన్నారు. సమస్యను రగిలించవద్దని మీడియాను కోరారు. చిరాగ్ కింద పశుపతి చాలా కాలం పని చేశారని, దీనిని అర్థం చేసుకుని పార్టీని బాబాయ్ నడిపించనివ్వాలని అన్నారు.