మైసమ్మ జాతరకు ముస్తాబు

కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత జాతర ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. భక్తులకు కొంగుబంగారమైన మైసమ్మ ఉత్సవాలు ఏడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం కార్తికమాసంలో ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా నుండి కాకుండా హైదరాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, మేడ్చల్, మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, వికారాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు జాతరకు తరలివస్తారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయానికి నిర్వాహకులు రంగులు వేశారు. అలాగే రకరకాల పూలు, మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే మైసమ్మ ఆలయ సమీపంలోని శివాలయ, రామాలయాల వద్ద ఉత్సవాలకు సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలోని కోనేరు నిండటంతో భక్తులను కనువిందు చేస్తుంది.
జాతర కార్యక్రమాలు
కొవిడ్ నిబంధనలు పాటిస్తు ఏర్పాట్లు
తాజావార్తలు
- టోల్ ప్లాజాపై ఎంపీ అనుచరులు దాడి.. వీడియో
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..
- గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి తేదీ
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా
- పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'
- జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
- బిలియనీర్ జాక్మా కనిపించారు..
- కప్పేసిన పొగమంచు.. పలు రైళ్లు ఆలస్యం