గ్రామాల్లో పోలీసుల విస్తృత దాడులు
మద్యం, గుడుంబా, గుట్కా అమ్మకందారులపై కేసులు
ప్రజలకు అవగాహన
చెన్నూర్ రూరల్, మే 18 : మండలంలోని ప్రతి గ్రామంలో లాక్డౌన్ సందర్భంగా మద్యం ఏరులై పారుతున్నది. చెన్నూర్ మండలకేంద్రం నుంచి మద్యం యథేచ్ఛగా గ్రామాల్లోని బెల్ట్షాపులకు తరలుతున్నది. గుడుంబా తయారీదారులపై పోలీసులు నిఘా పెట్టడంతో కొంతవరకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న బెల్ట్ షాపుల నిర్వాహకులు మద్యం అమ్మకాలపై దృష్టి సారించారు. కాగా.. లాక్డౌన్ నేపథ్యంలో గ్రామాల్లో అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేపడుతూ బెల్టు షాపుల నిర్వాహకులు లాభాలు గడిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొన్నిసార్లు పో లీసులు దాడులు చేసి, బెల్ట్షాపు నిర్వాహకులపై కేసులునమోదు చేస్తున్నారు. వేలాది రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు.
మద్యం, గుడుంబా అమ్మకాలకు చెక్..
మండలంలో కొన్ని నెలల క్రితం బెల్ట్షాపులు, గుడుంబా అమ్మకాలు పూర్తిగా నిలిపిపోయాయి. పోలీసులు నిత్యం గ్రామల్లో ప ర్యటిస్తూ జనమైత్రి కార్యక్రమం ద్వారా మద్యం అమ్మకాలపై, వివిధ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలను ఉత్తేజపరిచి అక్రమ మద్యం అమ్మకాలు మండలంలో లే కుండా చేశారు. గ్రామాల్లో కార్డన్సెర్చ్లతో బెల్ట్షాపులపై దాడు లు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు లు కూడా నమోదు చేశారు. గుడుంబా తయారీకి అవసరమయ్యే నల్లబెల్లాన్ని కిరాణా షాపుల్లో అమ్మకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో గుడుంబా అమ్మకాలు పూర్తిగా నిలిపివేశారు.
మళ్లీ జోరందుకున్న మద్యం అమ్మకాలు..
మండలంలో మళ్లీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఎలాంటి భయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే చెన్నూర్ పట్ట ణం నుంచి బెల్ట్షాపు నిర్వాహకులు మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్నారు. లాక్డౌన్ సమయంలో చేతిలో డబ్బుల్లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న సమయంలో బెల్ట్షాపుల్లో అధిక ధరల కు మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసు లు దాడులు నిర్వహించి.. పలువురు అమ్మకందారులను పట్టుకున్నారు. వారి నుంచి వేలాది రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
నిషేధిత గుట్కాలకు చెక్..
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చెన్నూర్ మండలంలో పాన్, కిరాణా షాపుల్లో చెన్నూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలు అమ్మే షాపుల యజమానుల మీద పీడీ యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో గుట్కా అమ్మకాలను మండలంలో నిలిపివేశారు. దీన్ని కొంత మంది హర్షం వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకుంటాం..
గ్రామాల్లో కొనసాగుతున్న మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అవసరమైతే కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాం. మద్యం విక్రయదారుల మీద పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే నిషేధిత గుట్కా అమ్మకాలను పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రజల సంరక్షణే పోలీసుల ధ్యేయం. మండలంలో మద్యం అమ్మకాలు జరుగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రజలు పోలీసులకు సహకరించాలి.