న్యూఢిల్లీ : ఫోన్ నంబర్లను కాకుండా టెలికం కంపెనీలను మార్చుకున్నట్లుగానే.. ఇకపై మొబైల్ వాలెట్లను కూడా మార్చుకునే వీలు కల్పించారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి. మనకు ఇష్టమైన మొబైల్ వాలెట్ చెల్లింపు సంస్థలకు మారే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనిలో మన మొత్తం వివరాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. సేవలందించే సంస్థలు మాత్రమే మారుతాయి.
రిజర్వ్ బ్యాంకు సర్క్యులర్ ప్రకారం, 2022 నాటికి ఈ మార్పులు అమలులోకి రావాలి. ఇదే గనక జరిగితే, పేటీమ్, ఫోన్పే, మొబిక్విక్ వంటి మొబైల్ వాలెట్లు వంటి అన్ని లైసెన్స్ పొందిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐలు) 2022 తో ఇంటర్పెరాబుల్ అవుతాయి. కేటీసీ నిబంధనలు పొందుపరిచిన వారు వివిధ మొబైల్ వాలెట్ల నుంచి డబ్బు పంపడం, స్వీకరించడం చేసుకోవచ్చు. మొబైల్ వాలెట్ల నుంచి ఇప్పుడు రూ .2,000 వరకు నగదు ఉపసంహరించుకునే వీలుండగా.. సర్క్యులర్ ప్రకారం వాలెట్ పరిమితిని కూడా రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈ చర్యలను ఏప్రిల్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్ఆపెరాబిలిటీని అవలంబించడం కోసం పూర్తి కేవైసీ పీపీఐ కోసం ఆర్బీఐ ఇంతకుముందు 2018 అక్టోబర్లో మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలతో ఏటిఎం, మైక్రో-ఏటిఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్స్ వద్ద నగదు ఉపసంహరించుకోవడానికి పేమెంట్ వాలెట్ లేదా ప్రీపెయిడ్ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..