న్యూఢిల్లీ: ఆప్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (48) కరోనా లక్షణాలతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన తొమ్మిది రోజుల నుంచి ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఓ మతాన్ని కించపరిచేలా ఫేస్బుక్లో పోస్టు చేయడంతో గత ఏడాది ఆప్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మాజీ జర్నలిస్ట్ అయిన జర్నైల్ సింగ్ 2009లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంపై షూ విసిరి అందరి దృష్టి ఆకర్షించారు. అనంతరం జర్నలిస్ట్ విధులకు స్వస్తిపలికారు. అనంతరం ఆప్లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. జర్నైల్ మృతికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.