హైదరాబాద్ : రాష్ర్టంలో సేంద్రియ ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సిటీ కంపోస్ట్ ఎరువుల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఎరువును రైతులు ఎక్కువగా వినియోగించేలా చూడాలన్నారు. ఉద్యాన రైతులను ఈ దిశగా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. రాబోయే తరాలకు నాణ్యమైన ఆహారం అందించడమే మన బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.