తిరుపతి, మే5, 2021: అమర రాజా సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ఏజెన్సీలతో భాగస్వామ్యం చేసుకుని 18 ఏండ్ల వయస్సు పైబడిన ప్రతి ఉద్యోగికి తప్పకుండా ఉచితంగా కోవిడ్ టీకాలు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సుకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుంది.18నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వా రందరికీ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే అమర రాజా సంస్థ ఈ ప్రక్రియను ప్రారంబిస్తున్నది.
అమర రాజా సంస్థ కో- ఫౌండర్, వైస్ చైర్మన్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ, “ఈ కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ ప్రభావం అంచనా వేయలేనంతగా మరింత తీవ్రరూపం దాల్చుతుందన్నారు. దీంతో పాటు, ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసిచారు. ఇదే దిశగా సంస్థగా మా వంతు చేయగలిగినంత కృషి చేయాలనుకుంటున్నాము” అని అన్నారు.