ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జల్పల్లిలో 38 పడకల తాత్కాలిక కొవిడ్ కేంద్రం ప్రారంభం
బడంగ్పేట, మే 4: కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం సిద్ధంగా ఉం దని, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు 38 పడకల కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపల్ పరిధిలోని ప్రిమియర్ ఫంక్షన్ హాల్లో 38 పడకల సామర్థ్యం గల కొవిడ్ కేంద్రాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందన్నారు.
కరో నా వచ్చింది అనగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉండి కొవిడ్ నుంచి బయట పడటానికి అవకాశం ఉందన్నారు. ఇంట్లో ఉన్న వారికి మెడికల్ కిట్స్ అం దజేస్తామన్నారు. చిన్న విషయానికి కొవిడ్ సెంటర్కు రావలసిన అవసరం లేదన్నారు. ఇబ్బంది కరం గా ఉన్న వారు మాత్రమే సెంటర్కు రావాలన్నారు. అత్యవసరం అయితే గాంధీకి తరలించడం జరుగుతుందన్నారు. 38 పడకల కరోన దవాఖానలో ఆక్సిజన్ అందుభాటులో ఉం చామన్నారు. మీర్పేట, బడంగ్పేట, జెల్పల్లి మున్సిపల్ కు సంబంధించిన వారు కొవిడ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కొవిడ్ రోగులకు ఆహారం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదన్నారు. కొవిడ్ సెంటర్లలో వైద్యులు అందుబాటులో ఉంటారన్నా రు. ఉచితంగా ఫంక్షన్ హల్ ఇచ్చిన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, చైర్మన్ అబ్దుల్లా సాదీ, బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అధికారులు, వైద్యులు ఉన్నారు.