హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ప్లాంట్లలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రారంభించింది. భోపాల్లోని బీహెచ్ఈఎల్ ప్లాంట్ నుంచి 6,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ను నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని దవాఖానలకు సరఫరా చేస్తున్నారు. ఈనెల 23న రికార్డు స్థాయిలో 975 సిలిండర్లను ఈ ప్లాంటు నుంచి తరలించారు. అలాగే హరిద్వార్లోని ప్లాంట్ నుంచి దాదాపు 16 వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ను ప్రతిరోజూ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 700 సిలిండర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని త్వరలోనే 2,200 సిలిండర్ల స్థాయికి పెంచనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మిగితా ప్లాంట్ల నుంచి కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందులోభాగంగా త్వరలోనే హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ (ఆర్సీపురం) నుంచి కూడా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు ముమ్మరం చేశారు.