రాయ్పూర్ : కొవిడ్-19 వ్యాక్సిన్ ధరను వీలైనంత తక్కువగా నిర్ణయించాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్కు లేఖ రాశారు. టీకా ధర వీలైనంత తక్కువగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. సీరం ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ను కేంద్రానికి రూ.150కి సరఫరా చేసి, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటల్స్కు రూ.600 చొప్పున ధర నిర్ణయించడాన్ని తప్పుట్టారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను ప్రపంచంలోనే అత్యధిక రేటుకు భారత్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసుల దృష్ట్యా అదనపు లాభాలను సంపాదించే లక్ష్యంతో టీకా రేట్లను సీరం సంస్థ పెంచిందని లేఖలో పేర్కొన్నారు. ఈ దోపిడీని నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ కనీస రేటును కేంద్రం నిర్ణయించాలని, ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్ల తెలిపారు. దేశంలో టీకాలు తయారు చేసే రెండు సంస్థలు మాత్రమే ఉన్నందున.. టెండర్ ద్వారా వ్యాక్సిన్ సేకరణలో ఆరోగ్యకరమైన పోటీ, కనీస రేటు పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు.
వ్యాక్సిన్ల కనీస రేటును కేంద్రం ఆధీనంలో బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్యు ఆఫ్ ఇండియా (బీపీపీఐ) నిర్ణయించాలని కోరారు. బీపీపీఐకి చెల్లింపులు చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలు అవసరానికి అనుగుణంగా వ్యాక్సిన్ సేకరించాలని, తద్వారా దేశం మొత్తం ఒకే రేటుకు వ్యాక్సిన్ అందుతుందన్నారు. వీలైనంత తర్వగా ధరలను నిర్ణయిస్తే.. వచ్చే నెల 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ చేపట్టేందుకు వీలవుతుందని లేఖలో సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి..