దేశ సర్వోన్నత న్యాయస్థానానికి, 48వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. కాలేజీ రోజుల్లో అధ్యాపకులు, విద్యార్థుల మధ్య తలెత్తే వివాదాలనూ సామరస్యంగా పరిష్కరించి ‘విద్యార్థి న్యాయమూర్తి’ పాత్రను సమర్ధవంతంగా పోషించిన ఆయన ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానానికి 48వ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు, అంటే 16 నెలలపాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కొనసాగనున్నారు మన తెలుగు బిడ్డ.
ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాభినందనలు తెలిపారు. మన తెలుగు తేజం శ్రీ ఎన్వీ రమణ గారు ఈ రోజు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయనకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, విద్యార్ధి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ, సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయడు, గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్యకృషీవలుడు శ్రీ రమణ గారు. అత్యున్యత న్యాయస్థానంలో అత్యున్యత పదవి 55 సంవత్సరాల తర్వాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డని చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుంది అని చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..