న్యూఢిల్లీ: దేశమంతా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నది. గత నాలుగు రోజుల నుంచి రోజూ మూడు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రధానంగా శ్వాసవ్యవస్థ పైనే ప్రభావం చూపుతుండటంతో బాధితులకు ఆక్సిజన్ అందించడం తప్పనిసరైంది. దాంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లోనైతే ఆక్సిజన్ కొరత కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ నేపథ్యంలో సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరికొన్ని ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లాలోని కొల్వాడ గ్రామంలోగల ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో నూతన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కూడా పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..