మహబూబ్నగర్: రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకుని నేరుగా రోగులకు అందించేలా దవాఖానల్లో వసతులు కల్పించామని మంత్రి చెప్పారు. ప్రపచంలో ఉత్పత్తవుతున్న కరోనా వ్యాక్సిన్లో 40 శాతం తెలంగాణలో తయారవడం మనందరకి గర్వకారణమని వెల్లడించారు. ఆయన ఇవాళ మహబూబ్నగర్లో విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో ఇప్పటివరకు రెండు లక్షల 36 వేల మందికి కరోనా టెస్టులు చేశామన్నారు. పాజిటివ్ ఉన్నవారికి వెంటనే వైద్యం అందిస్తున్నాం. మూడు ప్రత్యేక మొబైల్ పాలీ క్లినిక్ అంబులెన్సులను ప్రారంభిస్తున్నామన్నారు. వీటిద్వారా ఇంటి వద్దే ర్యాపిడ్ టెస్టుతో పాటు కొవిడ్ వైద్యం అందిస్తామని తెలిపారు. సీరియస్గా ఉన్న వారిని అదే అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తామని చెప్పారు. కరోనా సంబంధిత సమస్యలపై 08542241165 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే ఇంటికే మొబైల్ కొవిడ్ క్లినిక్ అంబులెన్సులను పంపిస్తామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..