న్యూఢిల్లీ: ఎన్నికలు వచ్చాయంటే.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పోలీసులు మద్యం, నగదు, అక్రమాయుధాలు సీజ్ చేశారన్న వార్తలు వినడం సహజం.. కానీ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఇక్కడ అభ్యర్థులంతా తమ ఓటర్లకు వంటకు సంబంధించిన సామగ్రి సరఫరా చేస్తుంటారు.
ఒక అభ్యర్థి సోదరుడు ఓటర్లకు పంపిణీ చేసేందుకు నిల్వ చేసుకున్న 30 కిలోల కాటేజ్ ఛీజ్ (పనీర్)ను పోలీసులు జప్తు చేసినట్లు సమాచారం. ఛాకోరి గ్రామంలో విలేజీ ప్రధాన్ పదవికి పోటీ చేసిన అభ్యర్థి దీప్ చంద్ సోదరుడు గజేంద్ర సింగ్ వద్ద పోలీసులు ఈ పనీర్ను జప్తు చేశారని సమాచారం.
ఈ నెల 15 నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నాలుగు దశల్లో యూపీ ఎన్నికల సంఘం నాలుగు దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నది. సోమవారం అమ్రోహ జిల్లాలో పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద గజేంద్ర సింగ్పై పోలీసులు కేసు పెట్టారు.
అమ్రోహి జిల్లాలో ఓటర్లను ఆహార పదార్ధాలతో అభ్యర్థులు ప్రలోభ పెట్టడం ఫస్ట్ టైం కాదు.. కొన్ని రోజుల క్రితం ఓటర్లకు 100 కిలోల రసగుల్లాలను పంపిణీ చేస్తున్న మరో అభ్యర్థిపై పోలీసులు కేసులు పెట్టారు.
వీటితోపాటు అక్రమ మద్యం, అక్రమ ఆయుధాల తయారీ ప్రాంతాలపై పోలీసులు దాడులు చేశారు. 16 అక్రమాయుధాల తయారీ ఫ్యాక్టరీల గుట్టు రట్టు చేశారు. బుదౌన్, అమ్రోహ, బిజ్నూర్ జిల్లాల్లో 461 ఆయుధాలు సీజ్ చేశారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు