అమరావతి : పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతిచెందాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాలో సోమవారం ఈ ఘటన జరిగింది.
సీతారాంపురం తండా గ్రామానికి చెందిన చెందిన కమాసాని లక్ష్మయ్య శివారులో జీవాలను మేపుతుండగా సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షంలో గొర్రెల మంద సమీపంలో పిడుగు పడింది.
దీంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.