సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు మొత్తం 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్-208, బీజేపీ-118, కాంగ్రెస్-58, ఎంఐఎం-10, సీపీఐ-1, సీపీఎం-1, స్వతంత్రులు- 171, ఇతరులు-1 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన ఆదివారం ఒక్కరోజే 407 నామినేషన్లు దాఖలయ్యాయి.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను జారీ చేసింది. గత మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.