ప్రతిఒక్కరూ తప్పనిసరిగాకొవిడ్ నిబంధనలు పాటించాలి
ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. కొవిడ్ మహమ్మారి ఉధృతి, రానున్న పండుగల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో వివిధ మతాల పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కొవిడ్ సెకండ్వేవ్ చేస్తున్న విధ్వంసాన్ని చూస్తున్నామని, జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 495 కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలను సూచిస్తుందన్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే మరో లాక్డౌన్ లేదా కఠినమైన ఆం క్షలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని తెలిపారు. గతేడాది త ప్పని స్థితిలో విధించిన లాక్డౌన్వల్ల ఆర్థిక పరిస్థితి ఏ స్థాయి లో దిగజారిందో అందరికీ అనుభవమేనని గుర్తు చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయిలో దెబ్బతింటుందని వివరించారు. కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని కోరారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్పై విజ యం సాధించవచ్చన్నారు. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉంటే సమాజానికి మేలు చేసినవారవుతారని తెలిపారు. గతేడాది కొవిడ్ విధుల్లో 84మంది పోలీసు అధికారులను కోల్పోయినా సమాజం కోసం తమ విధులు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణీత వయస్సు వారు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్తో శరీరం కొవిడ్ను ఎదుర్కొనే శక్తి పెంచుకుంటుందని తెలిపారు. సమావేశంలో ఎస్పీ ఆడ్మిన్ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు శ్రీధర్, శ్రీరాంకుమార్, ఇన్స్పెక్టర్లు సోమ్నారాయణసింగ్, రాజేశ్వర్, మహేశ్వర్, సురేశ్, శ్రీనివాస్, అప్పలనాయుడు ఉన్నారు.