పిట్లం/ బాన్సువాడ రూరల్/ ఎల్లారెడ్డి రూరల్/ గాంధారి/సదాశివనగర్/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/బిచ్కుంద, ఏప్రిల్ 16 : పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి, సర్పంచ్ అనిత, టీఆర్ఎస్ నాయకులు విజయ్, పండరి, కార్యదర్శి అశోక్గౌడ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. బాన్సువాడ మండలం బుడ్మి సహకార సంఘం ఆధ్వర్యంలో తాడ్కోల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి సింగిల్విండో అధ్యక్షుడు పిట్ల శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, రైస్మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఎజాస్, గోపాల్రెడ్డి, బుల్లెట్ రాజు, కుమ్మరి రాజు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బోయిని రాధావిఠల్ ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరహరి, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని వెంకటాపూర్లో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గౌలపల్లి సురేఖ ప్రారంభించారు.
గాంధారి మండలంలోని గౌరారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీడీ సుధీర్ డీపీఎం రమేశ్బాబుతో కలిసి ప్రారంభించారు. సీతాయిపల్లిలో ముదెల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం సర్పంచ్ బీర్కూర్ రాజమణితో కలిసి ప్రారంభించారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ మనోహర్రావు, ఏఎంసీ చైర్మన్ శంకర్, గౌరారం ఇన్చార్జి సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ ఉమారాణి, అంజయ్య, ఉపసర్పంచ్ సింగసాని పండరి, బీర్కూర్ రాజు, విండో కార్యదర్శి కృష్ణారెడ్డి, ఏఈవో దీక్షిత్రెడ్డి పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి విండో ఆధ్వర్యంలో పద్మాజివాడి, మోడెగామ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని ఎంపీపీ గైని అనసూయ, విండో చైర్మన్ తిపిరిశెట్టి గంగాధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పద్మాజివాడి సర్పంచ్ మడిపెద్ది కవిత, వైస్ చైర్మన్ కుంట శ్రీనివాస్ రెడ్డి, విండో సీఈవో దేవేందర్ రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శంకర్నాయక్, ఎంపీటీసీలు సుజాతా బాపురెడ్డి, మదుపట్ల జయశ్రీ రమేశ్రావు, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు దస్తగిరి, డైరెక్టర్లు మామిడి సంజీవ్రెడ్డి, లింగారెడ్డి, కల్వరాల్ మాజీ ఉపసర్పంచ్ డీసీ సాయిలు, రవీందర్రెడ్డి, మోహన్రెడ్డి, ఏఈవో స్నేహలత, భరత్రెడ్డి పాల్గొన్నారు.
రామారెడ్డి మండలం గోకుల్ తండా, ఇసన్నపల్లిలో అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో గోకుల్ తండా సర్పంచ్ లలిత, ఉపసర్పంచ్ తిరుపతి, రామారెడ్డి డైరెక్టర్ లక్ష్మాగౌడ్, మహిపాల్, ఎంపీటీసీ ప్రవీణ్గౌడ్, అగ్రికల్చర్ ఆఫీసర్ హరీశ్, సీఈవో కడెం భైరయ్య పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం వాజిద్నగర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ అశోక్ పటేల్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనూహ్య లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సాయిలు, ఉప సర్పంచ్ సాయిలు పాల్గొన్నారు.నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద సొసైటీ పరిధిలో ఉన్న వాడి, వదల్పర్తి, తాండూర్-కిచ్చన్నపేట్ పరిధిలోని ధర్మారెడ్డి, తాండూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్లు నర్సింహులు, ఆకిడి గంగారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ బోయిని రాధ, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్రెడ్డి, ఎంపీపీ రాజ్దాస్, సర్పంచులు శ్రీధర్గౌడ్, బండ లక్ష్మి, మాల్తుమ్మెద సొసైటీ మాజీ చైర్మన్ రాజారెడ్డి, ఏవో విజయశేఖర్, డైరెక్టర్ సిద్ధయ్య, మాజీ సర్పంచ్ విఠల్, సంజీవులు, సీఈవో జైపాల్రెడ్డి, కిష్టయ్య, ఏఈవోలు బబిత, నిఖిత పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
స్వరాష్ట్రంలో బస్టాండ్ అందుబాటులోకి..
పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్