హైదరాబాద్ : గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించారు. టీజీ సెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకులాల్లో 18,560 సీట్లు, బీసీ గురుకులాల్లో 20,800 సీట్లు ఉన్నాయి. గిరిజన గురుకులాల్లో 4777 సీట్లు, జనరల్ గురుకులాల్లో 2,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్ల సంఖ్య 46,937 ఉన్నాయి.