ఖలీల్వాడి, ఏప్రిల్ 11: నగరంలోని సెయింట్ ఆన్స్చర్చిలో గురు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రోమన్ క్యాథలిక్ డయాసిస్కు చెందిన పలువురు గురువులు తమ పది సంవత్సరాల ఆధ్యాత్మిక సేవలను పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక చర్చి విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ మాదాను అంథోని సేవలను కొనియాడారు. అనంతరం ఫాదర్ ఆంథోనితో పాటు రెవరెండ్ ఫాదర్ జూడ్ రాజ్, రెవరెండ్ ఫాదర్ మాదాను ఆల్ఫోన్స్, రెవరెండ్ ఫాదర్ గోలమారి ఆరోగ్యరెడ్డి, రెవరెండ్ ఫాదర్ వినయ్ను స్థానిక చర్చి కమిటీ, చర్చి కౌన్సిల్ మెంబర్లు, యూత్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం చర్చి ప్రాంగణంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల హృదయ సుపీరియర్ సిస్టర్ రెవరెండ్ ఫాతిమా బోయపాటి, హెడ్ మిస్ట్రిస్ రెవరెండ్ సిస్టర్ మార్గరెట్ కొమ్మారెడ్డి, కాన్వెంట్ సిస్టర్లు, చర్చి కౌన్సిల్ మెంబర్లు కిరీటయ్య, లారెన్స్, వైఆర్ డేవిడ్, హ్యారీ విన్సెంట్, బాలస్వామి, డామ్నిక్ సావియో, ఆకస్టిన్, ఆగ్నెస్ జోసెఫ్, మరియా, పుష్ప తదితరులు పాల్గొన్నారు.