హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మాస్కులు ధరించని పలువురి వ్యక్తులకు పోలీసులు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మేడ్చల్లో కరోనాపై అవగాహన కల్పించిన పోలీసులు మాస్క్ ధరించని 28 మంది వ్యక్తులు, ముగ్గురు దుకాణాదారులపై కేసులు నమోదు చేశారు. రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. అదేవిధంగా సనత్నగర్ స్పెషల్ డ్రైవ్లో మాస్కులు ధరించని 13 మందికి, కూకట్పల్లిలో 65 మందికి, ఖమ్మం జిల్లా ముదిగొండలో మాస్కులు ధరించని 14 మందికి పోలీసులు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు.
బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, రవాణా వాహనాల్లో మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ, కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.