ఐఐటీ-గౌహతి పరిశోధకుల అభివృద్ధి
గౌహతి, ఏప్రిల్ 7: ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీల పనితీరును మరింత మెరుగుపర్చే అత్యాధునిక సాంకేతికతను ఐఐటీ-గౌహతి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతతో బ్యాటరీలో ఇంకా ఎంత మోతాదులో చార్జ్ ఉన్నదో (స్టేట్ ఆఫ్ చార్జ్-ఎస్వోసీ) తెలుసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. దీంతో బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జీ అయ్యేలోపు ఎంత మొత్తంలో చార్జ్ను వాడుకోవచ్చో తెలుసుకోవచ్చని వెల్లడించారు. బ్యాటరీ పనితీరును, జీవిత కాలాన్ని దెబ్బతీసే ఓవర్ చార్జింగ్, అండర్ చార్జింగ్కు ఈ విధానంతో చెక్ పెట్టవచ్చని వివరించారు. ఈ వివరాలు ‘ఐఈఈఈ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు