న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశా డు. సీజన్ను సురక్షితంగా నిర్వహించేందుకు హైదరాబాద్లోని సదుపాయాలను వినియోగించుకోవాలని బీసీసీఐకి ట్విట్టర్ ద్వారా ఆదివారం సూచించాడు. ఈ ఏడాది ఐపీఎల్ తొలి దశ మ్యాచ్లకు ఓ వేదికైన ముంబై వాంఖడే స్టేడియంలో 10 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో మ్యాచ్లను వేరే చోటికి తరలిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐకి అజారుద్దీన్ తమ సన్నద్ధతను తెలిపాడు.
ఇవి కూడా చదవండి..