హైదరాబాద్: బీకాం పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ బంగారంలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నది. బీహెచ్ఈఎల్ కంపెనీలోని ఫైనాన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న సూపర్వైసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 26 వరకు అందుబాటులో ఉండనున్నాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నది.
మొత్తం పోస్టులు: 40
ఇందులో జనరల్ 25, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 10, ఎస్సీ 2, ఎస్టీ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీలో బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక చేసిన అభ్యర్థులను రాతపరీక్షకు ఆహ్వానిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా. పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 5
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 26
రాతపరీక్ష: మే 23
వెబ్సైట్: careers.bhel.in, bhel.com
ఇవికూడా చదవండి..