లక్నో: హోలీ జరుపుకోవద్దన్న ఒక వృద్ధురాలిపై కొందరు దాడి చేసి కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో సోమవారం ఈ దారుణం జరిగింది. మేవటిలోని తోలా ప్రాంతంలో ఒక ఇంటి ముందు కొందరు హోలీ జరుపుకున్నారు. ఆ ఇంటికి చెందిన 60 ఏండ్ల వృద్ధురాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన కొందరు వ్యక్తులు ఆ ఇంట్లోకి చొరబడి మృద్ధురాలిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఆమెను కాపాడబోయిన కుటుంబ సభ్యులను కూడా కొట్టారు. ఈ ఘటనలో ఆ వృద్ధురాలు చనిపోగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలకు గాయలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.