పుణె: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా తొలి బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా జట్టులోకి రిషబ్ పంత్ వచ్చాడు. ఇక ఇంగ్లండ్ టీమ్లోకి మలన్, లివింగ్స్టోన్, రెక్కీ టాప్లేలు వచ్చారు. గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషబ్ను తీసుకున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్సీ పగ్గాలను బట్లర్కు అప్పగించారు. మోర్గాన్కు తొలి వన్డేలో గాయమైంది.
ఇవీ జట్లు..
ఇండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లండ్: జేసన్ రాయ్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్, ఎల్ లివింగ్స్టోన్, ఎం అలీ, సామ్ కుర్రన్, టామ్ కుర్రన్, అబ్దుల్ రషీద్, ఆర్. టోప్లే