సూర్యాపేట : పట్టణంలోని సద్దుల చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై సాయంత్రం వాకింగ్ చేస్తున్న పాదచారులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. చెరువు ఒడ్డున మెట్లపై మహిళలకు చెందిన రెండు జతల చెప్పులు ఉన్నాయి. చెరువులో ఒక్కరే పడ్డారా? లేక ఇద్దరు ఉన్నారా ? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇద్దరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.