న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఆప్ సర్కార్ మంగళవారం రూ 65,000 కోట్లతో తొలిసారిగా డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఇది దేశభక్తి బడ్జెట్ అని అభివర్ణించారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. రాజధాని వాసులందరికీ ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని స్పష్టం చేశారు.
ఉచిత వ్యాక్సిన్కు బడ్జెట్లో రూ 50 కోట్లు కేటాయించామని వెల్లడించారు. 2024 నాటికి 25 శాతం నూతన వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండేలా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. విద్యా రంగానికి రూ 16,377 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ 9934 కోట్లు కేటాయింపులు చేపట్టామని మనీష్ సిసోడియా వెల్లడించారు.