హైదరాబాద్సిటీబ్యూరో,మార్చి8(నమస్తే తెలంగాణ): ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద పర్వతమైన కిలిమంజారోపై హైదరాబాద్కు చెందిన ఏడేండ్ల చిన్నోడు జెండా ఎగరేశాడు. సికింద్రాబాద్కు చెందిన తేలుకుంట్ల విరాట్ చంద్రకు ట్రెక్కింగ్పై ఆసక్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పర్వతారోహణ శిక్షకుడు భరత్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. కోచ్, తండ్రి సహాయంతో ఈనెల 2వ తేదీన పర్వతారోహణ చేపట్టగా 6వ తేదీన కిలిమంజారో గమ్యస్థానానికి చేరుకున్నాడు. జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. చిన్నవయస్సులోనే పర్వతారోహణలో విశేష ప్రతిభ చూపుతున్న విరాట్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.