ప్రభుత్వం తరపున అన్ని మౌలిక వసతులు
ప్రభుత్వ విధానాలతో పల్లె, పట్టణం ప్రగతిపథంలో..
పారిశ్రామికీకరణకు, వ్యవసాయం, కులవృత్తులకు సముచిత ప్రాధాన్యం
యూరప్, అమెరికా స్థాయిలో పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయం
పొకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ ప్రారంభోత్సవంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
కొత్తూరు, జూలై 31 : మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయండి.. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధికి సిద్ధం చేస్తాం.. వారికి ఉద్యోగావకాశాలు ఇవ్వండి.. అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడలో రూ.500 కోట్లతో నిర్మించిన పొకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సబితారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పొకర్ణ పరిశ్రమ యూరప్, అమెరికా స్థాయిలో ఉన్నదని అభినందించారు. పరిసరాల్లో టెక్స్టైల్స్ పరిశ్రమను స్థాపించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అవసరమైన శిక్షణను తామే ఇప్పిస్తామని వివరించారు. ఒక వైపు పారిశ్రామికీకరణ, ఐటీ రంగానికీ ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, కులవృత్తుల ప్రోత్సాహానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పాలని, అందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయండి.. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధికి సిద్ధం చేస్తాం.. అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడలో రూ.500 కోట్లతో నిర్మించిన పొకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పల్లె, పట్టణాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయన్నారు. పొకర్ణ పరిశ్రమ యూరప్, అమెరికా స్థాయిలో ఉందని అభినందించారు. పరిసరాల్లో టెక్స్టైల్స్ పరిశ్రమ స్థాపించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అవసరమైన శిక్షణను తామే ఇప్పిస్తామని వివరించారు. ఒక వైపు పారిశ్రామికీకరణకు, ఐటీ రంగానికీ ప్రాధాన్యమిస్తూ, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, కులవృత్తుల ప్రోత్సాహానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పొకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ అధినేత గౌతమ్ జైన్ వ్యాపారం సామ్రాజ్యం చాలా పెద్దదని, వారు మరిన్ని పరిశ్రమలు తెలంగాణలో నెలకొల్పాలన్నారు. అందుకు వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మన రాష్ట్రంలో ఇంతపెద్ద పరిశ్రమను నెలకొల్పడంపై పొకర్ణ ఇండస్ట్రీస్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఏ మాత్రం కాలుష్యం లేకుండా పరిశ్రమను నెలకొల్పడం గొప్ప విషయమన్నారు. ఇందులో ప్రతి నీటి చుక్కను తిరిగి వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, దానం నాగేందర్, కాలె యాదయ్య, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్రంజన్, కలెక్టర్ అమయ్కుమార్ పాల్గొన్నారు.
కేటీఆర్ కృషి వల్లే రాష్ర్టానికి పరిశ్రమలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
సీఎం కేసీఆర్ వంటి దూరదృష్టి, మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్షిప్ వల్లే రాష్ర్టానికి పెట్టుబడులు వస్తున్నాయి. గౌతమ్ జైన్ తనకు 15 ఏండ్లుగా తెలుసు. వారు మరిన్ని పరిశ్రమలు నెలకొల్పాలి. స్థానికులకు ఎక్కువ మొత్తంలో ఉద్యోగావకాశాలు కల్పించాలి.
కేటీఆర్ నాయకత్వంలో భారీ పరిశ్రమలు
మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్రెడ్డి
మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ర్టానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయి. టీఎస్ ఐ పాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు వస్తున్నాయి. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
స్థానికులకు పెద్దపీట వేయాలి
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
ఇంత పెద్ద పరిశ్రమ తమ నియోజకవర్గంలో నెలకొల్పడం ఇక్కడి ప్రజల అదృష్టం. ఇక్కడే ఎంతో మంది నిరుద్యోగులున్నారు. వారి ఉపాధికి పెద్దపీట వేయాలి. వారికి నైపుణ్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.