ఆమనగల్లు, మే 28 : కరోనా వైరస్ను నియంత్రిచేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ పక్రియను తీసుకొచ్చిందని, సామాజిక బాధ్యతగా సూపర్ స్ప్రెడర్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు కోరారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. వైరస్ బారిన పడకుండా అధికారులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని మాస్కు, భౌతికదూరం, శానిటైజేషన్పై మరింత ప్రచారం చేయాలన్నారు. మండలంలో వివిధ విభాగాల కింద గుర్తించిన సూపర్ స్ప్రెడర్స్కు టీకా వేసేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు ప్రజలంతా పాటించాలన్నారు. ఆమనగల్లు మండలంలో తొలిరోజు 70 మందికి వ్యాక్సిన్ వేశారు.
వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్..
ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను అదనపు కలెక్టర ప్రతీక్జైన్ పరిశీలించారు. కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పక్రియను సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కరోనా పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి మందులు పంపిణీ చేయడంతో పాటు వారి ఆరోగ్యంపై మానిటరింగ్ చేయాలన్నారు. బాధితులకు అత్యవసర వైద్యానికి అధికారులు స్పందించి మెరుగైన సేవలు అందేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, తహసీల్దార్ చందర్రావు, ఎంపీడీవో వెంకట్రాములు, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాడ్గులలో పకడ్బందీగా వ్యాక్సినేషన్..
మాడ్గుల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యాక్సినేషన్ను ఎంపీపీ పద్మ ప్రారంభించారు. మండలంలో 166 సూపర్ స్ప్రెడర్స్ గుర్తించారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎంపీడీవో ఫారుఖ్హుస్సేన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
యాచారంలో..
యాచారం, మే 28 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సూపర్ స్ప్రెడర్స్కు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ను శుక్రవారం అందజేశారు. మండలంలోని జర్నలిస్టులు, రేషన్డీలర్లు, ఎరువులు, విత్తనాల డీలర్లు, ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సిబ్బంది, పెట్రోల్ బంక్ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీపీ సుకన్య, తహసీల్దార్ నాగయ్య, డిప్యూటీ డీఎంఎచ్వో నాగలక్ష్మి, ఎంపీడీవో మమతాబాయి, ఎంపీవో శ్రీలత, సీఐ లింగయ్య, ఎస్ఐ ప్రభాకర్, వ్యవసాయాధికారి సందీప్ సందర్శించి వ్యాక్సిన్ అందజేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు లలితాదేవి, హెచ్ఈవో శ్రీనివాస్, ఎచ్వో శ్రీను, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం రూరల్, మే 28 : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో రేషన్డీలర్లు, ఫర్టిలైజర్ దుకాణదారులు, మీడియా ప్రతినిధులకు టీకా వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. సూపర్ స్ప్రెడర్లకు శని, ఆదివారాల్లో కూడా టీకా వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చినందున ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఆమె టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనాను నియంత్రించేందుకు టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్బాబు, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, వైద్యాధికారులు అభిరాం, జరూషా, సీఐ సైదులు, ఏవో వరప్రసాద్రెడ్డి, ఏఈవోలు శ్రవణ్, రఘు పాల్గొన్నారు.