షాద్నగర్టౌన్ జూలై 19: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో సోమవారం మున్సి పాలిటీలోని 21వ వార్డులో కౌన్సిలర్ జీ.టీ శ్రీనివాస్తో కలిసి ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి ఇంటి ముందు కనీసం ఆరు మొక్కలను నాటాలని, నాటిన ప్రతి మొక్కను సం రక్షించాలన్నారు. సకల జీవకోటికి ప్రాణాధారం మొక్కలని, హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మొక్క లను నాటాలని సూచించారు.
బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రారంభం
ప్రకృతి వనాల ద్వారా వాతావరణంలో మార్పులు ఏర్పడి అధికంగా వర్షాలు కురుస్తాయని చేవెళ్ల ఎంపీ పీ విజయలక్ష్మి , ఎంపీడీవో హరీశ్కుమార్ తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో భాగంగా పది ఎకరాల్లో మొక్కలు నాటే కార్య క్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ తులసీరాజ్, ఎంపీటీసీ మాధవి ఉన్నారు.
ప్రతి మొక్కను సంరక్షించాలి
నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని చేవెళ్ల అర్డీవో వేణుమాధవ్రావు పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల ఎంపీడీవోలతో కలిసి సమావేశం నిర్వహించారు. హరితహారం, పల్లె ప్రకృతి వనాల పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాలకు, మండలానికి 10 ఎకరాల చొప్పున ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డీవో హరీశ్కుమార్, షాబాద్ ఎంపీడీవో అరుణ, శంకర్పల్లి ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, జీవకోటి మనుగడకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని రావిచేడ్ గ్రామ సర్పంచ్ భారతమ్మ అన్నారు. సోమవారం మం డల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో, స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ విఠలయ్య, మాజీ ఎంపీటీసీ రంగయ్య, వార్డు సభ్యులు మల్లేశ్, ఇందిరమ్మ, రమాదేవి, పంచాయతీ కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు.