షాద్నగర్/ కొందుర్గు, జూలై 22 : రాష్ట్రంలోని పల్లెలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారం, పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలనే మార్చాయన్నారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను 100 శాతం పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగానే వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని చెప్పారు. పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని, సీజినల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టామన్నారు. గ్రామాల పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, పర్యావరణ పరీరక్షణ, వన నర్సరీల నిర్వాహణ వంటి అంశాల్లో మన రాష్ర్టానికి 15 అవార్డులు వచ్చాని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల రూ. 300కోట్ల నిధులను విడుదల చేస్తున్నామని వివరించారు. ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వనాలను అభివృద్ధి చేయడం సంతోషకరమని అన్నారు.
నేడు అన్ని పల్లెల్లో పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత, మంచి నీటి వసతులు కంటికి ప్రత్యేక్షంగా కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ సహకారంతో రాష్ట్రంలో నూతనంగా 14 వేల పరిశ్రమలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పనితీరుతో ఐటీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున అన్ని వర్గాల ప్రజలు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, వైస్ చైర్మన్ ఈట గణేష్లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీ భవనం, చౌదరిగూడ మండలం తుమ్మలపల్లిలో విద్యుత్ ఉపకేంద్రం, ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. చౌదరిగూడ మండలం చింతకుంటతండాల్లో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గుంజల్పహాడ్ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసే విద్యుత్ ఉప కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఫరూఖ్నగర్ మండలం చౌలపల్లి గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తున్న ప్రకృతి వనం పనులను ప్రారంభించారు. హాజిపల్లి గ్రామంలో నూతనంగా అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని పరిశీలించారు.
గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి: ఎమ్మెల్యే
పల్లె ప్రగతితో గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులను ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో డీపీవో శ్రీనివాస్రెడ్డి, డీఎన్పీవో సురేశ్బాబు, ఆర్డీవో లావణ్య, తాసిల్దార్లు శ్రీకాంత్రెడ్డి, రాములు, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, నాయకులు లక్ష్మణ్నాయక్, వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, బి.నర్సింహ, అంతయ్య, జూపల్లి శంకర్, నర్సింహ, మన్నె నారాయణ, సుదర్శన్, జి.వెంకట్రెడ్డి, దేవేందర్యాదవ్, విఠల్, లక్ష్మీనర్సింహారెడ్డి, మశ్చేందర్, కొందుర్గు మండల ఎంపీపీ జంగయ్య, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, జడ్పీటీసీలు రాగమ్మ, బంగారు స్వరూప, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, సర్పంచ్లు శ్రీధర్రెడ్డి, నర్సింహారెడ్డి, అరుంధతి, కావలి ఆదిలక్ష్మి, కుమార్, బాల్రాజు, బాబురావు, ప్రేమ్కుమార్, హరినాయక్, శివమౌళి, ఎంపీటీసీలు ఇస్తారమ్మ, దేవమ్మ, మంజుల, పార్వతమ్మ, రాజు, రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హాఫీజ్, రామకృష్ణ, ప్రేమ్కుమార్, రాజరామేశ్వర్రెడ్డి, శేఖర్, యాదయ్య, మోహన్రెడ్డి, మోత్యానాయక్, గోపాల్నాయక్, సాధిక్, శ్రీకాంత్గౌడ్, జబ్బార్ పాల్గొన్నారు.