పెద్దఅంబర్పేట, జూలై 15 : వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీలోని తట్టిఅన్నారంలోని పలు కాలనీల్లో వర్షాలకు ధ్వంసమైన ప్రాంతాలను స్థానికులతో కలిసి పరిశీలించారు. ఇందు అరణ్య విల్లాస్, హౌసింగ్ బోర్డు కాలనీ, హనుమాన్ నగర్ కాలనీల్లో వర్షాలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని స్థానికులు వివరించారు. ఇందు అరణ్య విల్లాస్లో వర్షాలధాటికి రోడ్లన్ని ధ్వంసమయ్యాయన్నారు. అదే విధంగా హనుమాన్నగర్ కాలనీలోని ఇండ్లలోకి నీళ్లు చేరుకుందని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతేడాది మాదిరిగానే హనుమాన్నగర్ కాలనీలోని ఇండ్లకు భారీగా నీళ్లు చేరడంతో ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్లో సూచించారు.
సమస్యల పరిష్కారంలో ముందుంటా..
ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. కాలనీలో ధ్వంసమైన ప్రాంతాలను స్థానికులతో కలిసి తిరిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా కాలనీ వాసులు పలు సమస్యలను వినతిపత్రం రూపంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కమిషనర్ అహ్మద్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్ష, కార్యదర్శులు బలరాం, దామోదర్, కౌన్సిలర్లు రోహిణిరెడ్డి, శ్రీధర్రెడ్డి, పాశం అర్చన, పరశురాం, కోటేశ్వరరావు, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రావుల గోపాల్గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.