కందుకూరు, ఆగస్టు 5 : రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడరు జంగారెడ్డి ఓ మృతుని కుంటుంబానికి అండగా నిలిచారు. కరోనాతో మరణించిన బాధితుని కుటుంబం చెల్లించిన మొత్తాన్నిఆసుపత్రి యాజమాన్యాన్ని ఓప్పించి తిరిగి ఇప్పించారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన ఎమ్మ కృష్ణ కరోనాతో హైదరబాద్ అంకుర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సపొందుతూ మరణించాడు. ఆ కుటుంబం నుంచి దవాఖాన యాజమాన్యం 4లక్షల 50వేల రూపాయలను వసూలు చేసింది. ఈ విషయం తెలిసిన జంగారెడ్డితో పాటు సర్పంచ్ శ్రావణి, డైరెక్టరు జగదీశ్వర్రెడ్డిలు స్పందించి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బాధితులు చెల్లించిన మొత్తం నుంచి 3లక్షల రూపాయలను తిరిగి ఇప్పించారు. దీంతో బాధిత కుంటుంబం జంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.