వికారాబాద్, ఆగస్టు 4 : వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కావాలని ఐటీ , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను బుధవారం ప్రగతి భవన్లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందించి త్వరలోనే వికారాబాద్లో పర్యటిస్తానని చెప్పినట్లు తెలిపారు.
జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయండి
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న బిల్లులతో పాటు పలు అంశాలను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ప్రగతి భవన్లో ఎమ్మెల్యే, మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. దౌల్తాబాద్, బొంరాస్పేట మండలాల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపడంపై ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఓర్వలేని ప్రతిక్షాల బురద చల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పట్టించుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, మాజీ జడ్పీటీసీ బాల్సింగ్, టీఆర్ఎస్ కొడంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగె శ్రీనివాస్ పాల్గొన్నారు.