న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: జిల్లాలో బోనాల పండుగను బుధవారం ప్రజలు ఘ నంగా జరుపుకున్నారు. వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ, చిట్టంపల్లి, అనంతగిరిపల్లి తదితర కాలనీలతో పాటు ఆయా గ్రామాల్లో కూడా ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలకు మహిళలు బోనాలతో నైవేద్యాలు సమర్పించారు. మహిళలు బోనాలతో కాలనీల్లో తిరు గుతూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తాం డూరు మండలం ఖాంజాపూర్ గ్రామంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోనాలతో తరలి వచ్చిన మహిళలతో, భక్తులతో ఖాంజా పూర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు తమ ఇష్ట దైవానికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, నాయకులు అమ్మవారిని దర్శంచుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. కోట్ పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.
మం డలంలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈదలమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణలతో స్థానిక సర్పంచ్ గొడ్డలి మల్లయ్య నిర్వహించారు. అలాగే నాసన్పల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ పద్మ నాగార్జునారెడ్డిల ఆధ్వర్యంలో బోనాల పండగను నిర్వహించారు. గ్రామంలోని ఊర డమ్మ, మైసమ్మ దేవతలకు ఆడపడుచులు నైవేద్యాలను సమర్పించారు. కుల కచర్ల మం డల పరిధిలోని పటెల్చెరువుతండా గ్రామ పంచాయతీలోని పల్లెగడ్డ మైసమ్మ తల్లి బోనా లు వైభవంగా నిర్వహించారు. పటెల్ చెరువుతండా గ్రామ పం చాయతీ నుంచే కాకుండా ముజాహిద్పూర్, దాస్యనాయక్తండా గ్రామ పంచాయతీల నుంచి ప్రజలు బోనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొడంగల్ మం డలంలోని హస్నాబాద్ గ్రామంలో మైసమ్మతల్లికి గ్రామస్తులు బోనాలు నిర్వహించారు. బోనం కుండలను ప్రత్యేకంగా అలంకరించుకొని మహిళలు ఊరేగింపుగా గ్రామంలో వీధివీధిన తిరిగి ఆలయ ప్రాంగణానికి చేరుకొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చు కున్నారు. పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది.