పెద్దేముల్, జూలై 19 : ప్రజలు ప్రశాంత వాతావరణంలో, మతసామరస్యంతో పండుగలు జరుపుకోవాలని తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఇన్చార్జి ఎస్ఐ గఫార్ ఆధ్వర్యంలో బక్రీద్, బోనాల పండుగల నేపథ్యంలో ఇరు మతాల పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించుకోవాలని కోరారు. చట్టాన్ని గౌరవిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, పోలీసులకు సహకరిస్తూ, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎవ్వరూ నమ్మవద్దన్నారు. ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఎస్ఐలు కృష్ణకాంత్, సరిత, హెడ్కానిస్టేబుల్ మల్లేశం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కరణ్కోట పోలీస్స్టేషన్లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా యువత అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఏడుకొండలు, ట్రైనీ ఎస్సై ప్రత్యూష, హిందూ ఉత్సవ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత ఉన్నారు.