తలకొండపల్లి జూలై 23: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశ పెడుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని దేవకి గార్డెన్స్లో స్థానిక సర్పంచ్ లలిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో, మండలంలోని 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్, జడ్పీటీసీ వెంకటేశ్తో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే రెండేండ్లలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తి పోతల పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని పేర్కొ న్నారు. రూ.22 కోట్లతో కడ్తాల్ నుంచి తలకొండపల్లి వరకు డబుల్ రోడ్డు, రూ.1.60 కోట్లతో కడ్తాల్-చల్లంపల్లి-సాలార్పూర్ వరకు రోడ్లకు త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల నిర్మాణా లను చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చంద్రయ్య, కుమార్, రమేశ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, ఆరైలు గోపాలకృష్ణ, ఆంజనేయులు పాల్గొన్నారు.